ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 1998 డీఎస్సీలో అర్హత సాధించిన దాదాపు 4,072 మంది అభ్యర్థులకు ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా వీరందరినీ సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించనుంది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే బీఈడీ అర్హతతో నియామకాలు పొందిన అభ్యర్థులు ఏడాది లోపు ఆరు నెలల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలని షరతు విధించింది పాఠశాల విద్యాశాఖ. అలాగే కాంట్రాక్ట్ నిబంధన ప్రకారం 60 ఏళ్ల లోపు వారికి మాత్రమే పోస్టింగులు ఇవ్వాలని సూచించింది. ఇక వీరి నియామకం కోసం ప్రస్తుతం ఆయా విభాగాల్లోని ఖాళీలను సర్దుబాటు చేశారు అధికారులు.
కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు ఉండి, పోస్టులు లేని చోట మరియు కొన్ని జిల్లాల్లో అదనంగా ఉన్న ఎస్జీటీ పోస్టులను ఇతర జిల్లాలకు బదిలీ చేయడం వంటివి పూర్తి చేశారు. కాగా జిల్లాల పునర్విభజనకు ముందు ఉన్న విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో 2,524 పోస్టులు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 1,381 పోస్టులను శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలుకు బదిలీ చేశారు. త్వరలోనే ఈ పోస్టుల్లో 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులను నియమించనున్నారు. కాగా వీరికి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కల్పిస్తూ సీఎం జగన్ కొన్ని నెలల క్రితం ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల ప్రకారం పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE