ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ప్రస్తుతం సివిల్ సప్లైస్ కమిషనర్ గా ఉన్న ఎం.గిరిజా శంకర్ ను స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్గా నియమించారు. దీంతో సీహెఛ్ రాజేశ్వర్ రెడ్డిని స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. అలాగే ఇప్పటివరకు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) కు ప్రభుత్వ సెక్రటరీ (సర్వీసెస్ అండ్ హెఛ్ఆర్ఎం) గా ఉన్న హెఛ్.అరుణ్ కుమార్ ను సివిల్ సప్లైస్ కమిషనర్ గా నియమించారు. ఇక కళాశాల విద్య కమిషనర్ గా ఉన్న పోలా భాస్కర్ కు జీఏడీ సెక్రటరీగా (సర్వీసెస్ అండ్ హెఛ్ఆర్ఎం)గా ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY