దేశంలో మరో 5,554 మందికి కరోనా పాజిటివ్, ఏ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువంటే?

India Records 5554 New Covid Cases, Covid Deaths September 10th, Mango News, Mango News Telugu, India Logs 5554 Covid Positive Cases,5554 New COVID19 Cases In Telangana, COVID19 Cases In India, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, India COVID News, Omicron Variant, COVID Booster Shots

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో మొత్తం 3,76,855 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 5,554 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 1.47 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,44,90,283 కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి.

అలాగే కొత్తగా మరో 18 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,28,139 కి పెరిగింది. మరో 6,322 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,39,13,294 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.70 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 48,850 (0.11%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (సెప్టెంబర్ 9 (8am)–సెప్టెంబర్ 10 (8am)):

  1. కేరళ – 1154
  2. మహారాష్ట్ర – 955
  3. కర్ణాటక – 670
  4. తమిళనాడు – 436
  5. ఒడిశా – 254
  6. రాజస్థాన్ – 254
  7. పశ్చిమబెంగాల్ – 204
  8. గుజరాత్ – 203
  9. ఉత్తర్ ప్రదేశ్ – 163
  10. తెలంగాణ – 128

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − eleven =