ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ (ఈడబ్ల్యూఎస్) కోటా కింద ఉద్యోగార్ధులకు వయోపరిమితిని ఐదేళ్లు పెంచింది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల తరహాలోనే.. ఈడబ్ల్యూఎస్ కింద ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ఉద్యోగార్ధులకు వయోపరిమితిని పెంచింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉద్యోగార్ధులకు 34 ఏళ్ల నుంచి 39 ఏళ్లకు పెంచబడింది. కాగా ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంస్థల్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోసం కేంద్ర ప్రభుత్వం 10శాతం రిజర్వేషన్ కోటాను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటా జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఇతర కేటగిరీ అభ్యర్థులకు ఓబీసీ (27%), ఎస్సీ (15%), మరియు ఎస్టీ (7.5%) లకు ఇప్పటికే రిజర్వేషన్ ప్రయోజనాలు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE