ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలాకు భరోసానిస్తూ కారుణ్య నియామకాలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి మరణించినట్లైతే ఆ కుటుంబానికి ఉపాధి కల్పించేందుకు కారుణ్య నియామకాలు చేపడతామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిప్రకారం ఇకపై ప్రొబేషన్ సమయంలో విధి నిర్వహణలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల స్థానంలో వారి కుటుంబ సభ్యులలో అర్హత కలిగిన ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
గత కొన్ని రోజులుగా ఉద్యోగుల చేస్తున్న విజ్ఞప్తిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని, ఆయన ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఉత్తర్వుల్లో తెలిపారు. కాగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కారుణ్య నియామకాలు చేపడతామని వెల్లడించారు.దీనికి సంబంధించి కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ప్రొబేషన్ సమయంలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించినందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY