కోడెల ఇంట్లో కంప్యూటర్ల చోరీ

Kodela Sivaprasad Responds Over Robbery At His House,Kodela Sivaprasad Responds Over Robbery,Kodela Sivaprasad , Robbery In Kodela Sivaprasad House,Kodela Sivaprasad Over Robbery At His House,AP Political Live Updates 2019, AP Political News, AP Political Updates, AP Political Updates 2019,Mango News Telugu,TDP Leader Kodela Sivaprasad

హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్‌ను తీసుకొచ్చిన సమయంలో కొత్త అసెంబ్లీకి కాకుండా తన నివాసానికి తరలించుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇప్పటికే అంగీకరించారు. ఈ ఫర్నిచర్‌ కు సంబంధించి గురువారం నాడు మరో హైడ్రామా చోటు చేసుకుంది. గురువారం రాత్రి సత్తెనపల్లిలో కోడెల నివాసంలో చోరీ జరిగింది. ఇద్దరు దుండగులు వచ్చి రెండు కంపూటర్లను ఎత్తుకెళ్ళారు. ఆఫీస్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఆఫీస్ పరిశీలించి వెళ్లారు. అయితే దుండగులు ఎత్తుకెళ్లిన కంప్యూటర్స్ మానిటర్లును ఈ రోజు ఉదయం కోడెల ఇంటి సమీపంలోనే సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

కోడెల నివాసం లోని ఫర్నిచర్‌ పరిశీలించేందుకు అసెంబ్లీ అధికారులు శుక్రవారం రానున్నారు. ఈ నేపథ్యంలో ముందు రోజు అనుకోని ఘటన జరగటంపై కోడెల శివప్రసాద్ స్పందించారు. తన నివాసంలోని ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్‌ దుర్వినియోగం అవుతున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అసెంబ్లీకి సంబంధించిన ప్రతి వస్తువుకు లెక్క ఉంటుందని, ఫర్నిచర్‌ వివరాలు తనవద్ద అన్ని ఉన్నాయని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు, మీడియా సంస్థలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.

 

[subscribe]
[youtube_video videoid=CSQWV9yxc54]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =