కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంతో 10వ తరగతి పరీక్షల నిర్వహణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3వ తేదీ వరకు పొడిగించడంతో వెంటనే పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. మళ్లీ పరీక్షల తేదీలు ప్రకటించే వరకు సీఎం వైఎస్ జగన్ సూచన మేరకు విద్యార్థులకు ఆన్లైన్ పాఠాల బోధన చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. ఇందుకోసం విద్యామృతం పేరుతో కార్యక్రమాన్ని రూపొందించామని, సప్తగిరి చానెల్ ద్వారా పదో తరగతి పాఠాలు ప్రసారం అవుతాయని తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పదో తరగతి పాఠ్యాంశాలకు సంబంధించిన తరగతులు ప్రసారం అవుతాయని మంత్రి సురేష్ వివరించారు. ఈ ఆన్లైన్ క్లాసులు సప్తగిరి యూట్యూబ్ ఛానల్లో కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ తరుణంలో సమయాన్ని వృథా చేయకుండా సప్తగిరి ఛానల్ ద్వారా ప్రసారమయ్యే తరగతులను విద్యార్థులు తప్పకుండా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఆన్లైన్ పాఠాలు బోధనకు అన్ని శాఖల పరిధిలోని స్కూల్స్ నుంచి ఉపాధ్యాయులు ఎంపిక జరుగుతుందని, ఆసక్తి గల ఉపాధ్యాయులు ముందుకు రావాలని మంత్రి సురేష్ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]