ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కు చేరుకుంది. మార్చ్ 30 , సోమవారం రాత్రి 164 మందికి కరోనా పరీక్షలు చేయగా, 17 మందికి కరోనా పాజిటివ్గా తేలిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడి కోసం రాష్ట్రంలో లాక్ డౌన్ అమలుతో చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక చర్చలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో మరో కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులేస్తున్నట్టు సమాచారం. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలోని కేంద్ర కారాగారం నుంచి 75 మంది ఖైదీలను విడుదల చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఖైదీలు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
[subscribe]