వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో సమావేశమవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన వారితో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల సమన్యాయం కర్తలు, జగనన్న సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్దినేటర్లు తదితరులు పాల్గొననున్నారు. కాగా సీఎం జగన్ అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీకి ఆహ్వానం అందుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు కావాలని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. అలాగే ఇటీవల గృహ సారథులుగా నియమితులైన వారి జాబితాను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమర్పించాలని కూడా సూచించింది. ఇక వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన విధానాలు, అమలు చేయాల్సిన వ్యూహాలు తదితర కీలక అంశాలపై సీఎం జగన్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE