రాష్ట్రంలో పాఠశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల అటెండెన్స్ రిజిస్టర్లో విద్యార్థుల కులం మరియు మతం నమోదు చేసే కాలమ్ ను తొలగిస్తూ, వాటి ప్రస్తావన ఉండకూడదని ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాఠశాలల అటెండెన్స్ రిజిస్టర్ విధానానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని పేర్కొన్నారు. ఒకవేళ ఇప్పటికే నమోదు చేస్తే వాటిని వెంటనే తొలగించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu