దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,38,018 కేసులు, 310 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,76,18,271 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,86,761 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఒడిశా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి.
మరో 1,57,421 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,53,94,882 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 94.09 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.29 శాతంగా నమోదైంది. దేశంలో ప్రస్తుతం 17,36,628 (4.62) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,891కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం వెల్లడించింది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (జనవరి 17 (8am)–జనవరి 18 (8am)):
- మహారాష్ట్ర – 31,111
- కర్ణాటక – 27,156
- తమిళనాడు – 23,443
- కేరళ – 22,946
- ఉత్తర్ ప్రదేశ్ – 15,553
- గుజరాత్ – 12,753
- ఢిల్లీ – 12,527
- ఒడిశా – 10,489
- వెస్ట్ బెంగాల్ – 9,385
- రాజస్థాన్ – 9,236
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF