మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ధిక వ్యవహారాలు కొనసాగడం, ప్రజల సౌకర్యార్థం లాక్డౌన్ సడలింపుల్లో మరికొన్ని మినహాయింపులు ఇచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తునట్టు తెలుస్తుంది. కరోనా తీవ్రత ఎక్కువుగా ఉన్న కంటైన్మెంట్ జోన్స్, ఇతర బఫర్ జోన్స్ లో తప్ప అన్ని ప్రాంతాల్లో రోజువారీ సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చే అంశంపై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది.
లాక్డౌన్ లో వెసులుబాటు కల్పించి, ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తునట్టుగా సమాచారం. సరి-బేసి విధానంలో దుకాణాలు తెరిచే అవకాశం ఉంది. అలాగే సొంత వాహనాల నియంత్రణ, ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలపై ప్రణాళికలు సిద్ధం చేస్తునట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]