ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

AP Govt Over Polavaram Reverse Tendering, Ap Political Live Updates, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, High Court Shock to AP Govt, High Court Shock to AP Govt Over Polavaram, High Court Shock to AP Govt Over Polavaram Reverse Tendering, Mango News Telugu, Polavaram Project Reverse Tendering, Polavaram Reverse Tendering

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రణాళిక బోర్డును రద్దు చేయాలనీ నిర్ణయం తీసుకుని సంబంధిత ఫైలును ఆర్థిక శాఖ పరిశీలనకు పంపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను అన్ని రంగాల్లో సమానస్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ ప్రణాళిక బోర్డుల ద్వారా ఆయా ప్రాంతాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించి, వాటి అమలును ప్రభుత్వం సమీక్ష చేస్తుందని సమాచారం. సామాజిక అసమానతలతో పాటు అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతులపై వ్యత్యాసాలను నివారించడం పై ఈ ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు దృష్టి సారించనున్నాయి.

విజయనగరం కేంద్రముగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాతో కలిపి ఉత్తరాంధ్ర ప్రాంతీయ ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయనున్నారు. కాకినాడ ప్రధాన కేంద్రంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలతో ఒక ప్రాంతీయ ప్రణాళిక బోర్డును ప్రతిపాదించారు. గుంటూరు కేంద్రంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో ఒకటి, కడప కేంద్రంగా చిత్తూరు, కర్నూలు, అనంతపురం,వైస్సార్ కడప జిల్లాలతో మరో ప్రాంతీయ ప్రణాళిక బోర్డును ఏర్పాటు చేస్తారు. ఈ బోర్డులకు కేబినెట్ స్థాయి ర్యాంకుతో మూడేళ్ళ కాల వ్యవధితో ఛైర్మన్ ను నియమిస్తారు. వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆర్థిక వృద్ధి, సంక్షేమ రంగాలకు చెందిన నలుగురు నిపుణులను సభ్యులుగా నియమిస్తారు. నియామకాలు జరుపుకుని త్వరలోనే ఈ నాలుగు బోర్డులు వ్యవస్థ అమలులోకి రానుంది.

 

[subscribe]
[youtube_video videoid=rO5NSoD4oew]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 14 =