హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పరిధిలో ఇటీవల ఓ మూడు కుటుంబాల్లో 9 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వనస్థలిపురంలో 8 కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా నిర్ణయించినట్లు ఆదివారం నాడు అధికారులు ప్రకటించారు. మే 4, సోమవారం నుంచి ఈ కాలనీలలో కఠినమైన ఆంక్షలు అమల్లో ఉంటాయని, వారం రోజుల పాటు రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తునట్టు అధికారులు ప్రకటించారు. మరోవైపు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సోమవారం నాడు ఈ కంటైన్మెంట్ జోన్ ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా కాలనీల్లో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను పలిశీలించారు. మలక్ పేట్ గంజ్ కారణంగానే వనస్థలిపురంలో కరోనా కలకలం మొదలయిందని, ప్రజలెవరూ అనవసరంగా భయపడకుండా నిబంధనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
వనస్థలిపురంలో 8 కంటైన్మెంట్ జోన్ల జాబితా:
- హుడా సాయి నగర్
- సుష్మా సాయినగర్
- కమలానగర్
- రైతుబజార్-సాహెబ్ నగర్ రోడ్డు
- ఏ, బీ టైప్ కాలనీలు
- ఎస్కేడీ నగర్
- ఫేజ్-1 కాలనీ
- సచివాలయనగర్
They are namely:
1) HUDA Sai Nagar
2) Sushma Sai Nagar
3) Kamala Nagar
4) A, B colonies near Rythu Bazar
5) Phase- 1 colony
6) Sachivalaya Nagar
7) SKD Nagar and
8) Rythu Bazar – Saheb Nagar road.— Devireddy Sudheer Reddy MLA (@D_SudheerReddy) May 3, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu