ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో కొత్త పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. నాయీ బ్రహ్మణులకు, రజకులకు, టైలర్లకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశ్యంతో ‘జగనన్న చేదోడు’ పేరుతో త్వరలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ ఏడాది రూ.10వేల చొప్పున ఐదేళ్లపాటు వారికి ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఈ పథకాన్ని అమలుచేయనున్నారు. త్వరలో అర్హుల ఎంపికకు విధివిధానాలను నిర్ణయించనున్నారు.
[subscribe]