త్వరలో ఏపీలో జగనన్న చేదోడు కార్యక్రమం

Andhra Pradesh Latest News, AP Breaking News, AP Govt Jagananna Chedodu Programme, AP Govt Latest Schemes, AP Jagananna Chedodu Scheme 2020, Jagananna Chedodu Programme, Jagananna Chedodu Scheme, Jagananna Chedodu Scheme In AP, Mango News Telugu
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో కొత్త పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. నాయీ బ్రహ్మణులకు, రజకులకు, టైలర్లకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశ్యంతో ‘జగనన్న చేదోడు’ పేరుతో త్వరలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ ఏడాది రూ.10వేల చొప్పున ఐదేళ్లపాటు వారికి ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఈ పథకాన్ని అమలుచేయనున్నారు. త్వరలో అర్హుల ఎంపికకు విధివిధానాలను నిర్ణయించనున్నారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =