విశాఖపట్నంలో పేదల భూముల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పేదల ఇళ్ల స్థలాల కేటాయింపుపై దాఖలైన పిటిషన్ను ఈరోజు (శుక్రవారం) హైకోర్టు కొట్టివేసింది. దీంతో 1.85 లక్షల మంది లబ్ధిదారులకు ఉపశమనం కలుగనుంది. ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికోసం 6000 ఎకరాల అనువైన భూమి గుర్తించి సేకరణ చేపట్టింది. అయితే, కొందరు దీనిపై పిటిషన్ దాఖలు చేయడంతో ఇళ్ల స్థలాలు పంపిణీ నిలిచిపోయింది. ఈ పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు అన్ని పిటిషన్లను కొట్టివేసింది. అలాగే, నిలిచిపోయిన ప్లాట్ల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు జగనన్న ఇళ్ల పథకం కింద పేదలకు ప్లాట్లను కేటాయించనుంది. భూముల కేటాయింపునకు ప్రభుత్వం ఇప్పటికే టోకెన్లు జారీ చేసి హద్దులు కూడా వేసింది. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ