సంగం డెయిరీ కేసు : టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు

AP High Court, AP High court granted bail to TDP leader, AP High Court Granted Bail to TDP Leader Dhulipalla Narendra in Sangam Dairy Case, AP High Court grants conditional bail to Dhulipalla Narendra, Bail to TDP Leader Dhulipalla Narendra in Sangam Dairy Case, Dhulipalla gets bail in Sangam dairy case, Dhulipalla Narendra, Mango News, Sangam Dairy Case, Sangam Dairy Case news, TDP Leader Dhulipalla Narendra Bail, TDP Leader Dhulipalla Narendra in Sangam Dairy Case

సంగం డెయిరీలో అక్రమాలు కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఏప్రిల్ 23న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నరేంద్ర మరియు సంగం డెయిరీ ఎండీ గోపాల్‌కృష్ణన్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై సోమవారం నాడు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టి వారిద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.

నాలుగు వారాలు పాటుగా విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. విజయవాడలో ఎక్కడ నివాసముంటున్నారో, ఆ చిరునామాను విచారణాధికారికి అందించాలని సూచించింది. ఇక విచారణ విషయంలో 24 గంటల ముందు విచారణాధికారి నోటీసు ఇవ్వాలని, అలాగే విచారణకు వీరు పూర్తిగా సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసులో అరెస్టు అయి రిమాండ్ లో ఉన్న సమయంలోనే ధూళిపాళ్ల నరేంద్ర కరోనా బారినపడి కోలుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =