బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్షలో పాల్గొన్న బండి సంజయ్

Bandi Sanjay, Bandi Sanjay Participated in a Protest at Party Office over Farmers Issues, BJP Poru Deeksha, Farmers Issues, Mango News, Protest at Party Office over Farmers Issues, Rythu Gosa-BJP Poru Deeksha, Telangana BJP President Bandi Sanjay, Telangana BJP President Bandi Sanjay Participated in a Protest at Party Office over Farmers Issues, Telangana Rythu Gosa-BJP Poru Deeksha

తెలంగాణ రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన యాసంగి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, తడిసిన, రంగు మారిన ధాన్యానికి మద్ధతు ధర చెల్లించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుగోస-బీజేపీ పోరు దీక్షలో భాగంగా బండి సంజయ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నాడు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, రైతుబంధు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కరోనా మార్గదర్శకాలు అనుసరిస్తూ దీక్ష చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఈ దీక్షలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ తమ నివాసాల్లోనే ఈ దీక్షను కొనసాగిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకొని రైతుల సమస్యల పరిష్కారానికి చొరవచూపి, చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ అన్నారు. ఈ నిరసన దీక్షలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ కూడా పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 13 =