రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ అమలు, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రి హరీశ్ రావు, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, వైద్యశాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా బాధితులకు అందుతున్న చికిత్సతో పాటుగా లాక్డౌన్ అమలుతున్న తీరు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ సమీక్షలో చర్చించనున్నట్టు తెలుస్తుంది.
ఇక కరోనా వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో మే 15 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ అందించే స్పెషల్ డ్రైవ్ వాయిదాపడిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్ తిరిగి ప్రారంభించడం మరియు రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్స్ కు (ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కూరగాయాల వ్యాపారులు, సేల్స్ మెన్) కూడా వ్యాక్సిన్ పంపిణీ చేసే అంశంపై చర్చించి, కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ