ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు ఈ రోజు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్డౌన్ను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, రోజా, రజినీ, సంజీవయ్య, వెంకటగౌడ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముందుగా ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, పలు చోట్ల జన సమూహాలతో కార్యక్రమాలు నిర్వహించారని, వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కిషోర్ బాబు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై మే 5, మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్నఅనంతరం ఐదుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై వారం రోజులలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది, వారిపై తీసుకున్న చర్యలపై రాష్ట్ర డీజీపీని కోర్టు వివరణ కోరినట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu