కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన పరీక్షలు, జాతీయ స్థాయి జేఈఈ, నీట్ పరీక్షలు, పలు రాష్ట్రాల్లో వృత్తి విద్యా, సాంకేతిక విద్యకు సంబంధించి పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయిదా పడిన జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన తేదీలను ఈ రోజు ఖరారు చేశారు. జులై 18 వ తేదీ నుంచి 23 వ తేదీ మధ్య జేఈఈ(మెయిన్స్) పరీక్షలు, జులై 26న నీట్ పరీక్ష, ఇక ఆగస్టులో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించారు. సీబీఎస్ఈ బోర్డు 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణ తేదీలపై కూడా అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఇంజినీరింగ్ మరియు మెడికల్ కళాశాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలు ఏప్రిల్, మే నెలలో జరగాల్సి ఉండగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉండడంతో ముందుగా వాయిదా పడ్డాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu