వైసీపీలో అదే జరుగుతోందా?

Is YCP Leader Mallikarjuna Reddy Working For TDP?, Mallikarjuna Reddy Working For TDP, Working For TDP, YCP, TDP, Jana Sena, AP Assembly Elections, Rajampet, Meda Mallikarjun Reddy, Akepati Amarnath, Rajampet Politics, Lok Sabha Elections, P Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
YCP, TDP, Jana Sena, AP Assembly Elections, Rajampet, Meda Mallikarjun Reddy, Akepati Amarnath

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని.. వైసీపీ అధినేత జగన్ కొత్తవారికి ఎక్కడైతే సీట్లు ఖరారు చేసారో.. వారంతా అక్కడ ఆ పార్టీకి తెర వెనుక తూట్లు పొడిచే పనులు చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి విషయంలోనూ ఆ విధంగానే అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీలోనే మనిషి ఉన్నా సరే మనసు మాత్రం చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నట్టు న్యూస్ వినిపిస్తోంది.

గతంలో రెండు సార్లు రాజంపేటలో ఎమ్మెల్యేగా గెలిచిన మేడా మల్లికార్జున్ రెడ్డిని ఈసారి పక్కనపెట్టి.. ఆకేపాటి అమర్నాథ్ కు జగన్ టికెట్ ఖరారు చేసారు. దీంతో మేడా.. అమర్నాథ్‌కు సహాయాన్ని అందిస్తూ ప్రచారాలలోనూ పాల్గొంటున్నారు. అయితే తెర వెనుక మాత్రం అమర్నాథ్‌కు వ్యతిరేకంగా తన వర్గాలతో పని చేయిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మేడా మల్లికార్జున్ రెడ్డి 2014లో టీడపీ తరఫున విజయం సాధించారు. తర్వాత వైసీపీలో చేరి 2019లో విజయాన్ని సాధించారు. ఈసారి కూడా మేడాకే టికెట్ వస్తుందని ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా భావించారు. కానీ వైసీపీ అధినేత ఆకేపాటి అమర్నాథ్‌కి టికెట్ ఖరారు చేయడంతో.. మేడా లోలోపల రగిలిపోతున్నారట. దీంతో మల్లికార్జున రెడ్డి తన అనుచర వర్గాన్ని అంతా టీడపీ వైపు వెళ్లేలా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

ఇటు ఎప్పుడయితే మేడాను కాదని తనకు టికెట్ ఖరారు చేశారో అప్పటి నుంచి అమర్నాథ్ మేడా వర్గాన్ని పట్టించుకోవడం మానేసిందట. దీంతో మేడా వర్గం హర్టయ్యి విషయాన్ని తమ నాయకుడికి చెప్పడంతో మేడా మల్లికార్జునరెడ్డి కూడా తెరవెనుక మంతనాలు సాగిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. తన అనుచరులను కొంతమంది టీడీపీ లోకి పంపుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని మెజారిటీ కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు లీక్ అవుతున్నాయి. దీంతో మెల్లమెల్లగా టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం గెలుపు అవకాశాలు పెరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయాన్ని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాత్రం ప్రచారంపైనే ఫోకస్ పెడుతున్నారు తప్ప కనీసం బూత్ స్థాయిలో కూడా మేడా వర్గాలను పట్టించుకునే ప్రయత్నాలు చేయడం లేదట. ఇప్పటికైనా అమర్ నాథ్ రెడ్డి మేలుకోకుండా .. ఇలా ఒంటెద్దు పోకడలతో మిగిలిపోతే మాత్రం ఆయనకే నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fifteen =