దావోస్లో స్టార్టప్ కంపెనీలతో ప్రత్యేక మీటప్ నిర్వహించామని, మున్ముందు రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి దావోస్ పర్యటనకు వెళ్లిన ఆయన.. పర్యటన విశేషాలను ఈరోజు మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దావోస్ సదస్సులో వివరించామని, ప్రపంచస్థాయి వేదికపై సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రగతిని గొప్పగా ప్రొజెక్ట్ చేశామని తెలిపారు.
దీనికోసం దావోస్ సదస్సులో ఏపీ తరపున ఒక ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీ రంగానిదే అని, అందుకే దానిపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. ఈ విషయమై పలు సంస్థల ప్రతినిధులతో చర్చించామని, దీనిలో భాగంగానే పలు ప్రముఖ సంస్థలతో ఎంవోయూలు చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో 30 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి తగిన అవకాశాలు ఉన్నాయని, రానున్న రోజుల్లో మరికొన్ని కంపెనీలను ఈ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. దావోస్ పర్యటన సంతృప్తినిచ్చిందని మంత్రి అమర్నాథ్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF