ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 27, శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటారని భావించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గ సమావేశంలో రాజధాని నిర్మాణం, జీఎన్రావు కమిటీ నివేదిక, అభివృద్ధి కార్యక్రమాలు వంటి అంశాలపై చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలు:
- రాజధానిపై మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం.
- జీఎన్రావు కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించిన మంత్రిమండలి, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) రిపోర్టు జనవరి 3న సమర్పించే అవకాశం.
- జీఎన్రావు కమిటీ నివేదిక, బీసీజీ రిపోర్టుపై హైపవర్ కమిటీ సమీక్షించిన తరువాత రాజధానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
- రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోలు వ్యవహారంపై న్యాయ నిపుణుల సలహా అనంతరం సీబీఐ, లోకాయుక్తా లేదా సీఐడీతో విచారణ జరిపించాలని నిర్ణయం.
- 2011 జనాభా లెక్కల ప్రకారమే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ.
- పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు.
- ఎస్టీలకు 4 , ఎస్పీలకు 19.08, బీసీలకు 38 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం.
- రూ.78 కోట్లతో 412 కొత్త 108 అంబులెన్సు వాహనాల కొనుగోలుకు మంత్రి మండలి ఆమోదం.
- వైద్య సేవలు నిమిత్తం రూ.60 కోట్లతో 656 కొత్త 104 వాహనాలు కొనుగోలుకు నిర్ణయం.
- పసుపు, మిర్చి ఉల్లి, చిరుధాన్యాలు వంటి పంటలకు మద్దతు ధరలను ప్రకటించి, ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసేలా తీర్మానం.
- మచిలీపట్నం పోర్టు నిర్మాణం డీపీఆర్ తయారీకి రైట్స్ నిర్మాణ సంస్థకు అప్పగిస్తూ నిర్ణయం, పోర్టును ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయం.
[subscribe]
AP Cabinet Decided To Go For CBI Investigation Over Insider Trading Says Perni Nani | Mango News
05:53
AP Govt Is Going To Buy New Ambulances With Worth Of 71 Crores Says Perni Nani | Mango News
05:24
AP CM YS Jagan Discussion With Cabinet Ministers Over Capital Change Issue | AP Capital Controversy
03:29
AP Cabinet Meeting Starts Over Capital Change Issue | AP 3 Capitals Issue | AP Politics | Mango News
03:24