ఈ నెల 26 నుంచి వైఎస్సార్సీపీ ‘సామాజిక న్యాయం’ పేరిట బస్సు యాత్ర చేపట్టనుంది. ఈ మేరకు నూతన మంత్రి వర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ యాత్ర నిర్వహించనున్నట్లు బుధవారం పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిలో భాగంగా.. శ్రీకాకుళం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురం జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో బస్సు యాత్రతో పాటు బహిరంగ సభలు కూడా నిర్వహించనున్నారు. బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనారిటీలకు చెందిన మొత్తం 17 మంత్రులు ఈ బస్సు యాత్రలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఆయా మంత్రులకు, జిల్లా అధికారులకు ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించటానికి ఈ యాత్రను ఉపయోగించుకోవాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది.
బహిరంగ సభలు జరుగు జిల్లాలు
మే 26 – శ్రీకాకుళం (లేదా) విజయనగరం
మే 27 – రాజమండ్రి
మే 28 – నరసరావుపేట
మే 29 – అనంతపురం
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ