ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి తీవ్ర అస్వస్థత పాలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చల్లా భగీరథ రెడ్డి గత కొన్ని రోజులుగా కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లా అవుకు లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు ఆదివారం ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ లోని ప్రముఖ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి భగీరథ రెడ్డికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఇక చికిత్స సందర్భంగా ఊపిరితిత్తుల్లోని ఖాళీల్లో రక్తస్రావం గుర్తించిన వైద్యులు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. కాగా భగీరథ రెడ్డి తండ్రి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ నేత అయిన చల్లా రామకృష్ణా రెడ్డి వైస్సార్సీపీ ఎమ్మెల్సీగా పనిచేస్తూ 2020లో హఠాన్మరణం చెందారు. ఆయన ఆకస్మిక మృతితో కుమారుడు భగీరథ రెడ్డికి సీఎం జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇక ఎమ్మెల్సీ పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE