దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 1,190 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,55,828 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో మహారాష్ట్ర (257), కేరళ (163), తమిళనాడు (144), కర్ణాటక (103), తెలంగాణ (71) వంటి 5 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే మరో 1379 కరోనా మరణాలు నమోదుకావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,452 కు పెరిగింది. కరోనా మరణాల సవరణ నేపథ్యంలో పంజాబ్లో 1,369 మరియు కేరళలో రెండు కలవడంలో తాజా మరణాల సంఖ్య 1379 గా నమోదైంది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 16 వేలుకుపైగా (16,243 (0.04%)) యాక్టీవ్ కేసులు ఉన్నాయి..
మరోవైపు కొత్తగా 1,190 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,09,133 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.78 శాతంగానూ, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద నవంబర్ 2, బుధవారం ఉదయం 7 గంటల వరకు 219.66 కోట్లకుపైగా (2,19,66,16,127) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 1,23,859 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE