ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆదివారం నాడు వెలువడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 11 కార్పొరేషన్స్, 73 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో కనీస ప్రభావాన్ని కూడా చూపలేకపోయాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల వారీగా నమోదైన ఓటింగ్ శాతం వివరాలను ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది. ఈ ఎన్నికల్లో సంచలన ఫలితాలు సాధించిన వైఎస్సార్సీపీ 50 శాతానికి పైగా ఓట్లు దక్కించుకుంది.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలవారీగా ఓటింగ్ శాతం వివరాలు:
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ – 52.63 శాతం
- తెలుగుదేశం పార్టీ – 30.73 శాతం
- జనసేన పార్టీ – 4.67 శాతం
- భారతీయ జనతా పార్టీ – 2.41 శాతం ఓట్లు
- నోటా – 1.07 శాతం
- సీపీఎం – 0.81 శాతం
- సీపీఐ – 0.80 శాతం
- కాంగ్రెస్ – 0.62 శాతం
- ఇండిపెండెంట్ అభ్యర్థులకు – 5.73 శాతం
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ