ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎలక్షన్ కమిషనర్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగ రాజ్ ఏప్రిల్ 11 న బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా అంతా సన్నద్ధంగా ఉండాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. విధుల్లో ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా పనిచేయాలని ఆయన కోరారు.
ప్రస్తుతం దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి వలన అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. మున్సిపల్, జడ్పీటీపీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా అంతా సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సమయానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని, ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తిగా అమలు అయ్యేలా చూడాలని జస్టిస్ కనగరాజ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]