ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్ సమీర్ శర్మ సోమవారం నాడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ముందుగా సీఎస్ గా సమీర్ శర్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎస్ గా విధులు నిర్వహిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ సెప్టెంబర్ 30వ తేదీన పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నూతన సీఎస్ గా సమీర్ శర్మ అక్టోబర్ 1న బాధ్యతలు చేపట్టనున్నారు. సమీర్ శర్మ ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా మరియు రిసోర్స్ మొబలైజేషన్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ