ఏపీలో తోలి దశ పంచాయతీ ఎన్నికలు: నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Andhra Pradesh Government, Andhra Pradesh panchayat elections, AP Gram Panchayat Elections, AP Gram Panchayat Elections News, AP Local Body Polls, AP Panchayat Elections, AP Panchayat Elections Nominations, AP Panchayat Elections Nominations For First Phase, AP Panchayat polls, AP Panchayat polls 2021, AP Political Updates, Mango News, Panchayat polls

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి దశలో విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251 పంచాయతీలు, 32,522 వార్డులకు ఫిబ్రవరి 9 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు జనవరి 29 నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగా, నేటి (జనవరి 31, ఆదివారం) సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. జనవరి 29, 30, 31 తేదీల్లో మూడు రోజుల పాటుగా ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అభ్యర్థులు నుంచి నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది. మరోవైపు శనివారం నాటికీ సర్పంచ్ పదవులకు 8773, మరియు వార్డు పదవులకు 25519 నామినేషన్స్ దాఖలైనట్టు తెలుస్తుంది.

ఏపీ పంచాయతీ ఎన్నికల ముఖ్య తేదీలు: ఫేజ్-1

  • నోటిఫికేషన్ జారీ: జనవరి 27
  • నామినేషన్ల స్వీకరణ: జనవరి 29
  • నామినేషన్ చివరి రోజు: జనవరి 31
  • నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 1
  • ఉపసంహరణ చివరి తేదీ: ఫిబ్రవరి 4
  • ఎన్నికల తేదీ: ఫిబ్రవరి 9
  • లెక్కింపు తేదీ: ఫిబ్రవరి 9
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =