దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 5,275 సెషన్స్ లో 2,44,307 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో జనవరి 31, ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా దాదాపు 37 లక్షలకు పైగా (37,44,334) లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు పేర్కొన్నారు.
మరోవైపు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఇప్పటివరకు 68,962 కరోనా వ్యాక్సినేషన్ సెషన్లు నిర్వహించినట్టు తెలిపారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో (4,63,793), రాజస్థాన్ లో (3,29,611), కర్ణాటకలో(3,15,370), మధ్యప్రదేశ్ లో (2,98,376), మహారాష్ట్రలో (2,69,064), గుజరాత్ లో (2,46,054), వెస్ట్ బెంగాల్ లో (2,43,069), ఒడిశాలో (2,06,424) లబ్దిదారులకు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్రం తెలిపింది.
మొత్తం ఇప్పటికి దాకా కరోనా వ్యాక్సినేషన్ లో ఈ 8 రాష్ట్రాల నుంచే 63.34 % లబ్ధిదారులు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో (1,87,252), రాజస్థాన్ లో (1,61,332), తెలంగాణలో (1,68,606) మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ వేసిన వారి సంఖ్యను బట్టి జనవరి 29 నాటికీ భారత్ ఐదవ స్థానంలో ఉంది. మిగతా దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ ముందుగానే ప్రారంభమైనప్పటికీ, వాటితో పోలిస్తే భారత్ ఎంతో ముందున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ