ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 3,569 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో 2, విశాఖపట్నం జిల్లాలో 2 పాజిటివ్ కేసులు నమోదవగా, మిగతా 24 జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని తెలిపారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో ఎనిమిది మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారని చెప్పారు. ఇక ఏప్రిల్ 27 నాటికీ ఏపీలో మొత్తం 3,35,26,945 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ