జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై తీర్మానం చేశామని పేర్కొన్నారు. నేడు హైదరాబాద్లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా కేటీఆర్ ప్రసంగించారు. ‘మేరా భరత్ మహాన్’ అనే నినాదాన్ని సాకారం చేసే నాయకుణ్ణే దేశం కోరుకుంటోందని, అలాంటి నాయకుడిని తెలంగాణ అందిస్తుందని కేటీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడాలంటే కేసీఆర్ వంటి విజన్ ఉన్న నాయకుడు కావాలని, ఆయన విజన్ ఏంటో ఈ ఏడేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం చూస్తే అర్ధమవుతుందని ప్రకటించారు.
కేసీఆర్ ఒక టార్చ్ బేరర్ అని, ఈ దేశానికి ఇప్పుడు కేసీఆర్ లాంటి నాయకుడు అవసరమని పేర్కొన్నారు. దీంతో టీఆర్ఎస్ ఇకపై జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టనుందని చెప్పకనే చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించనున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు కేటీఆర్ ఈ కామెంట్స్ చేయడం విశేషం. ఇంతకుముందు 2019 లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే తన ప్రయత్నాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ