ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో వదంతులు వస్తున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు స్పందించారు. రోజుకో రకంగా పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఫేక్ న్యూస్లను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని చెప్పారు. టైమ్ టేబుల్ పై అబద్దపు ప్రచారం, తన పేరును ఫోర్జరీ చేసి పరీక్ష షెడ్యూల్ ను విడుదల చేయడం లాంటివి చేసి ఆన్లైన్లో పెడుతున్నారని చెప్పారు.
ఇలాంటి వందంతులు సృష్టించడం సైబర్ నేరాల పరిధిలోకి వస్తోందని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని చిన వీరభద్రుడు హెచ్చరించారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలపై ఇంకా ఎలాంటి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడి విద్యార్థులు ఇప్పటికే మానసికంగా ఆందోళన చెందుతున్నారని, వారిని ఈ విషయంలో మరింత గందరగోళానికి గురిచేయడం తప్పని చెప్పారు. ఈ వదంతులు నమ్మి విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురికావద్దని విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu