కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఏప్రిల్ నెల మాదిరిగానే మే నెలలో కూడా తెల్లరేషన్ కార్డులో ఉన్న ఒక్కో కుటుంబ సభ్యునికి 12 కేజీల బియ్యం, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1500 నగదు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మే నెలకు సంబంధించి బియ్యం, నగదు పంపిణీ దాదాపుగా పూర్తీ కావచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నగదు పంపిణీ విషయంపై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు.
“రాష్ట్రంలోపేదలకు రెండో విడత 1500 రూపాయల ఆర్థిక సాయం గత వారమే బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరిగింది. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో డబ్బులు డ్రా చేసుకునేందుకు అందరూ ఒకేసారి వెళ్లవద్దు. భౌతిక దూరాన్ని తప్పక పాటించండి. మిగిలిన 5 లక్షల 38 వేల మందికి పోస్టాఫీసుల ద్వారా డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. మే 11, సోమవారం నుంచి పోస్టాఫీసుల ద్వారా 1500 రూపాయలను లబ్ధిదారులు పొందవచ్చని” మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu