ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు పాఠశాలల్లో నాడు–నేడు, మధ్యాహ్నభోజన పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం అయ్యేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల నేపథ్యంలో పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇకపై అన్ని ప్రాథమిక పాఠశాలలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు నిర్వహించనున్నారు. అలాగే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి.
ముందుగా సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో ఉదయం 9.30 గంటలకు పాఠశాలలు ప్రారంభం కావడంపై చర్చ జరిగింది. సాధారణంగా పలు దేశాలు, రాష్ట్రాల్లో పాఠశాలలు ఉదయం 8 లేదా 8.30 గంటలకు ప్రారంభమవుతున్నాయని పేర్కొన్నారు. ఉదయం పూట పిల్లల్లో చురుకుదనం ఎక్కువుగా ఉంటుందని, విషయాలను తొందరగా గ్రహించగలుగుతారని అన్నారు. సాధ్యమైనంత త్వరగా ఉదయం వేళ పాఠశాల్లో బోధన ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఈ మేరకు పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ