ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అస్వస్థత గురయ్యారు. శుక్రవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మంత్రి విశ్వరూప్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంత ఒత్తిడికి గురైన ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అమలాపురం పర్యటనలో ఉన్న మంత్రి విశ్వరూప్ ఈ క్రమంలో తనకు ఛాతీలో నొప్పిగా ఉందని, చేయి ఒకవైపుకు లాగుతోందని ప్రక్కనున్న నాయకులకు చెప్పడంతో అప్రమత్తమైన వారు వెంటనే పట్టణంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశ్వరూప్ను కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే మంత్రికి కొన్ని ముఖ్యమైన వైద్య పరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. మంత్రి విశ్వరూప్ను ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, కోలుకున్న తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేస్తామని వారు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ