పీపుల్స్ రిపబ్లిక్ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా సెప్టెంబర్ 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు భారతదేశ పర్యటనకు రానున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రి షేక్ హసీనా చివరిసారిగా 2019 అక్టోబర్లో న్యూఢిల్లీని సందర్శించారని తెలిపారు. తాజాగా చేపట్టబోయే భారత్ పర్యటనలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ ను కలువనున్నారు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంప్రదింపులు జరపనున్నారని తెలిపారు.
ఇక కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ను కూడా ప్రధాని షేక్ హసీనా కలవనున్నారు. అదేవిధంగా ఆమె అజ్మీర్ను సందర్శించే అవకాశం ఉంది. ఇటీవలి సంవత్సరాలలో రెండు దేశాలు గొప్ప సంప్రదింపులను కొనసాగించాయని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా యొక్క రాబోయే పర్యటన బలమైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు, పరస్పర విశ్వాసం మరియు అవగాహన ఆధారంగా ఇరు దేశాల మధ్య బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY