ఏపీ ఎంపీలు రెడ్డ‌ప్ప‌, మాధ‌వి లకు క‌రోనా పాజిటివ్‌ గా నిర్ధారణ

Andhra Pradesh, Andhra Pradesh COVID-19 Daily Bulletin, Andhra Pradesh Department of Health, ap coronavirus cases today, AP COVID 19 Cases, AP Total Positive Cases, AP YCP MP Reddappa, AP YCP MPs Tests Positive for Coronavirus, COVID-19, COVID-19 Daily Bulletin, YCP Madhavi Tests Positive for Coronavirus, YCP MPs Reddappa and Madhavi Tests Positive

ఈ రోజు నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సమావేశాలకు హాజరయ్యే ఎంపీలకు ముందుగానే కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఇద్దరు ఏపీ ఎంపీలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పార్లమెంట్ వద్ద నిర్వహించిన పరీక్షల్లో చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డప్పకు కరోనా వైరస్‌ పాజిటివ్ గా తేలింది. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. కొన్నిరోజులు ఐసోలేషన్‌లో ఉండాలని ఎంపీ రెడ్డప్పకు అధికారులు సూచించారు. అలాగే అరకు వైసీపీ ఎంపీ మాధవి కూడా కరోనా బారినపడ్డారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమె, పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్నారు. అధికారులు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలడంతో, రెండు వారాల పాటుగా ఆమె ఢిల్లీలోనే ఉండి చికిత్స తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =