దేశంలో ఇటీవల పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13, ఆదివారం నాడు కూడా 22543 కరోనా పాజిటివ్ కేసులు, 416 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,60,308 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 29,531 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 11,549 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు మొత్తం 7,40,061 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 69.8 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.79 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 2,90,344 మంది వివిధ ఆసుపత్రులు, ఐసొలేషన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఆదివారం నాటికీ మహారాష్ట్రలో 52,53,676 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu