ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. అత్యున్న ఉద్యోగాల కోసం నిర్వహించే గ్రూప్-1 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ పోస్టుల భర్తీకి సంబంధించి శుక్రవారం రాత్రి ఏపీపీఎస్సీ కార్యదర్శి అరుణ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. వీటితోపాటు రవాణా శాఖలో మరో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ను విడుదల చేశారు. కాగా ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి అక్టోబర్ 13 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని, నవంబర్ 2 వరకు దరఖాస్తు ప్రక్రియకు అవకాశం కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్లో సూచించారు. అలాగే ఏఎంవీఐ పోస్టులకు నవంబర్ 2వ తేదీ నుంచి 22 వరకు గడువు విధించారు.
ఇక అభ్యర్థులు పూర్తి వివరాలకోసం ఏపీపీఎస్సీ వెబ్సైట్ psc.ap.govin/ ను సందర్శించాలని సూచించారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను డిసెంబర్ 18, 2022 నిర్వహించనున్నారు. అలాగే మెయిన్స్ పరీక్షలు మార్చి 15, 2023 తర్వాత నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెుత్తం 13 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 10, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ పోస్టులు 12, డిప్యూటీ సూరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోస్టులు 13 పోస్టులు ఉన్నాయి. గతంలో ప్రకటించిన మేరకు ప్రిలిమ్స్, మెయిన్స్ లలో అర్హత సాధించిన వారికి గ్రూప్-1 పోస్టులకు రాతపరీక్షలతోపాటు ఇంటర్వ్యూలు నిర్వహించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY