ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) ఎండీ సురేంద్రబాబును బదిలీచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కాగా ప్రస్తుతం రవాణా శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న కృష్ణబాబుకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా రాష్ట్రప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ఉత్తర్తులు జారీ చేసింది. అలాగే చేనేత, జౌళిశాఖ కార్యదర్శి శ్రీనివాస శ్రీ నరేష్ కూడ బదిలీ అయ్యారు. ఆయనను సాధారణ పరిపాలనశాఖకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న జె.మురళికి చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. అదేవిధంగా ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈవో గా జేఎన్వీ సుబ్రహ్మణ్యం ను ప్రభుత్వం నియమించింది. సుబ్రహ్మణ్యం అసోం నుంచి డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు.
[subscribe]