తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెఛ్ఎంసీ సహా పలు ప్రాంతాల్లో పేదల కోసం పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఓల్డ్ మారేడ్ పల్లిలో రూ.36.27 కోట్లతో నిర్మించిన 468 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీహెచ్ మల్లా రెడ్డి, మహమూద్ అలీలు లాంఛనంగా ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ముందుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ఇక్కడ ఉచితంగా కట్టించి ఇస్తున్న ఈ ఇళ్లులు ప్రైవేట్ బిల్డర్స్ కడితే 60 నుంచి 70 లక్షల రూపాయలు ఉంటుందని, అయితే ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఆ ఆస్తిని అందజేస్తున్న మహానాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే, రూపాయి తీసుకోకుండా ఇలాంటి ఇళ్లు ఇచ్చే ప్రభుత్వం తెలంగాణలో తప్ప ఎక్కడా లేదని వేరే రాష్ట్ర ప్రజలు కూడా అంటున్నారని అన్నారు. ఈ ప్రాంతాన్ని పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచుకుని, మోడల్ కాలనీగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత లబ్దిదారులపై ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ