జ‌న‌సేన‌ వైపే ప్రజలు చూస్తున్నారా?

Are People Looking Towards Jana Sena?, People Looking Towards Jana Sena, Visakhapatnam South, Jana Sena,Vamsi Krishna Yadav, Vasupalli Ganesh,YCP, TDP, Chandrababu, Jagan,BJP,Pawan kalyan, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Visakhapatnam South,Jana Sena,Vamsi Krishna Yadav, Vasupalli Ganesh,YCP, TDP, Chandrababu, Jagan,BJP,Pawan kalyan

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉన్న మ‌హా న‌గ‌రాల్లో విశాఖ‌ప‌ట్ట‌ణం ఒక‌టి. ఈ ప్రాంతాన్ని రాజ‌ధానిగా అభివృద్ధి చేస్తామ‌ని ఐదేళ్ల పాటు ప్ర‌చారం చేసుకున్న వైసీపీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి స్థిర‌మైన రాజ‌ధాని లేకుండా చేసిందన్న టాక్ ఉంది.  ఓవైపు అమ‌రావ‌తిని అభివృద్ధి చేయ‌క‌, మ‌రోవైపు విశాఖ‌ప‌ట్ట‌ణం పేరును వాడుకుని జ‌గ‌న్ ప్ర‌భుత్వం కాల‌క్షేపం చేసిందన్న వాదన వినిపిస్తోంది. వైసీపీ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ భవిష్య‌త్తు అంధ‌కారమైందన్న ప్రచారం కూడా సాగుతోంది.

విశాఖ‌ప‌ట్ట‌ణం సిటీలో మూడు నియోజ‌క‌వ‌ర్గాలుండ‌గా.. వీటిలో విశాఖ సౌత్ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్‌.. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి పేరుతో అధికార వైసీపీలో చేరారు. ఐదేళ్ల కాలంలో త‌న ఆస్తులు రెట్టింపు చేసుకున్నారే త‌ప్ప.. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం ఆయ‌న చేసిందేమీ లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

న‌గ‌రం మ‌ధ్య‌లో ఉన్న‌ప్ప‌టికీ.. ఇక్క‌డ వైసీపీ పాల‌న‌లో జ‌రిగిన అభివృద్ధి శూన్యం. డాబాగార్డెన్స్, పాత పోస్ట్ ఆఫీస్ ఏరియా, జగదాంబా జంక్షన్, అల్లిపురం, ద్వారకానగర్, జ్ఞానాపురం ప్రాంతాలు ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌స్తాయి.  శరవేగంతో వృద్ధి చెందుతున్న విశాఖ‌ప‌ట్ట‌ణం వైసీపీ పాల‌న‌లో వెనుక‌బ‌డిపోయింది.

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇరుకైన రోడ్లు ఉండ‌టంతో ప్ర‌జ‌లు ట్రాఫిక్ స‌మ‌స్య‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నా.. ఇక్క‌డి ఎమ్మెల్యే ప‌రిష్క‌రించ‌లేక‌పోయారు. రోడ్లమీదనే ప్రవహించే మురుగు కాలువలు, పేరుకుపోయిన చెత్త, దుర్వాసన, మురికికాలువలపై తేలే వ్యర్ధాలు, దోమల సంచారంతో విశాఖ సౌత్ నియోజక‌వ‌ర్గం ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.  విశాఖపట్టణం ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గంలో పారిశుధ్యం అతిపెద్ద సమస్య.

ఈ ఎన్నిక‌ల్లో వాసుప‌ల్లి గ‌ణేష్ వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం, బీజేపీ బ‌ల‌ప‌ర్చిన జ‌న‌సేన అభ్య‌ర్థి వంశీకృష్ణ యాద‌వ్ పోటీ చేస్తున్నారు. నియోజ‌కవ‌ర్గం ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉండే వ్య‌క్తిగా వంశీకృష్ణ యాద‌వ్‌కు పేరుంది. పేద ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తూ.. సాయం కోసం ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రినీ ఆదుకునే వ్య‌క్తి జ‌న‌సేన అభ్య‌ర్థి వంశీకృష్ణ యాద‌వ్‌.

ప్ర‌జారాజ్యం పార్టీ ద్వారా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వంశీ కృష్ణ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిద్ధాంతాలు న‌చ్చి జ‌న‌సేన‌లో చేరారు.  వంశీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్ర‌జాసేవ‌లో ఉండే వ్య‌క్తి వంశీకృష్ణ యాద‌వ్‌. అందుకే జనసేన అభ్యర్థి వంశీ కృష్ణ యాదవ్ ను గెలిపిస్తే తప్ప అభివృద్ధి జరగదనే అభిప్రాయానికి అక్కడి ప్రజలు వచ్చినట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 2 =