జగన్ పై దాడి.. అదే క‌ణ‌త‌కు త‌గిలితే..?!

Attack On CM Jagan Mohan Reddy At Vijayawada,AP,CM Jagan,Attack On Cm Jagan,AP Politics,Telugu News,AP State Assembly Elections,Mango News,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,CM YS Jagan,YS Jagan,CM Jagan,CM YS Jagan Latest News,YSRCP,CM YS Jagan Election Campaign,Attack On CM YS Jagan,CM YS Jagan Attacked,CM YS Jagan Injured In Stone Attack,CM YS Jagan Injured,Memantha Siddham Bus Yatra,Siddham,Stone Attack on CM YS Jagan,Vijayawada,CM YS Jagan Stone Hit Incident,Sajjala Ramakrishna Reddy,CM YS Jagan Attack News,Mango News Telugu

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై దాడి ఘ‌ట‌న దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం అయింది. రాజ‌కీయంగా పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై ఈసీ కూడా సీరియస్ అయింది. బెజవాడ సీపీ కాంతి రాణా తాతా నుంచి నివేదిక ను తెప్పించుకుంది. సీఎం జగన్, వెల్లంపల్లి కి అస‌లు త‌గిలిందేంటి.. రాయేనా.. లేక వేరేనా అనే విష‌యాల‌పై లోతైన ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. ఇప్పటికే విచారణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన సీపీ రాణా … జగన్ పై దాడి కేసును నిరంతరం పరివేక్షిస్తున్నారు డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి. వైసీపీ నేత‌లు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, మ‌ల్లాది విష్ణు త‌దిత‌రులు కూడీ ఈసీతో భేటీ అయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ప్ర‌త్యేక బృందాలు ద‌ర్యాప్తు చేస్తున్నాయి. అలాగే సిట్ ఏర్పాటుకు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలాఉండ‌గా.. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌త్య కు ప‌క్కా ప్లాన్ కుట్ర ప‌న్నుతున్నార‌ని, దానిలో భాగ‌మే ఈ దాడి అని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు ప్ర‌తిచోటా త‌న కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని, విద్వేష రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని అన్నారు. ఈసంద‌ర్భంగా స‌జ్జ‌ల గ‌గుర్పొడిచే వ్యాఖ్య‌లు చేశారు. దాడిలో సీఎం జ‌గ‌న్ కు బ‌ల‌మైన గాయ‌మైందని, కొంచెం కింద‌కు త‌గిలి ఉంటే క‌న్ను పోయేదని వివ‌రించారు. క‌ణ‌త‌కు త‌గిలి ఉంటే ప్రాణ‌మే పోయేదని ఆందోళ‌న వెలిబుచ్చారు. దీని అంత‌టికీ కార‌ణం.. చంద్ర‌బాబు, ఆయ‌న రెచ్చ‌గొడుతున్న తీరే అని విమ‌ర్శిస్తుంచారు. జ‌గ‌న్ కు పెరుగుతున్న ఆద‌ర‌ణతో ఆయ‌న విజ‌యం ఖాయ‌మ‌ని త‌ట్టుకోలేక ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోపించారు. దాడి ఘ‌ట‌న‌ను న‌ట‌న అన‌డానికి సిగ్గు ఉండాలని అన్నారు.

స‌జ్జ‌ల్ చేసిన వ్యాఖ్య‌లు వైసీపీలో ఆందోళ‌న‌ను రేకెత్తిస్తున్నాయి. వామ్మో.. క‌ణ‌త‌కు త‌గ‌లితే ఇంకేమైనా ఉందా..? అనే చ‌ర్చ మొద‌లైంది. అంతేకాకుండా.. అస‌లు నిందితుడు గురి పెట్టింది క‌ణ‌త‌కా.. క‌న్నుకా.. అనే అనుమానాలూ వ్య‌క్తం అవుతున్నాయి. టార్గెట్ క‌ణ‌తే అయితే వైసీపీ ఆరోపిస్తున్న‌ట్లుగా అది జ‌గ‌న్ హ‌త్య‌కు ప్లాన్ చేసిన‌ట్లే. వెల్లంప‌ల్లి ఫిర్యాదు మేర‌కు సింగ్‌న‌గ‌ర్ పోలీసులు ఇప్ప‌టికే హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. మ‌రోవైపు సిట్ కూడా రంగంలోకి దిగింది. కాగా, జ‌గ‌న్‌పై దాడి ఘ‌ట‌నపై వైసీపీ ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తూనే ఉంది. దాడి ఒక ఎత్త‌యితే.. అది న‌ట‌న అంటూ టీడీపీ చేస్తున్న దుష్ప్ర‌చారంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఎవ‌రైనా చేజేతులా ప్రాణాల‌కు ముప్పు తెచ్చుకుంటారా..; క‌నీస స్పృహ లేకుండా టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌లు ఉంటున్నాయంటూ వైసీపీ శ్రేణులు ఆందోళ‌న కొన‌సాగిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 13 =