సార్వతిక్ర ఎన్నికలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికలకూ సిద్ధం అవుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నడూ లేని రీతిలో నేతలపై రాళ్ల దాడులు కలకలం రేపుతున్నాయి. జగన్ పై దాడి తాలుకూ మంటలు రేగుతుండగానే.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడపైనా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా రాళ్ల దాడి జరగడం చర్చనీయాంశం అవుతోంది. జగన్పై దాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. రాజకీయ ప్రచార సభలకు బందోబస్తును పెంచుతున్నారు. ఏపీ రాజకీయాలను ఇప్పుడు రాళ్ళు కొత్త మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజకీయ నేతలపై దాడులు కొత్తవి కావు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుపై కూడా చెప్పులపై దాడి చేశారు. అయితే.. రాళ్ళ దాడులు మాత్రం రాజకీయాల్లో కొత్తగా మారాయి. అవమానించడమే లక్ష్యమైతే చెప్పులు విసరడం లాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా గతంలో చాలా సంధర్భాల్లో జరిగాయి. చెప్పుల వల్ల అవమానం జరుగుతుంది.. ప్రాణాలకు మాత్రం ప్రమాదం ఉండదు. విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో మేమంతా సిద్దం యాత్రలో పాల్గొన్న సీఎం వైయస్ జగన్ పైకి ఆగంతకుడు శనివారం రాయితో దాడి చేశారు. అదీ రాయా..? ఎయిర్ గన్ తో దాడిచేశారా ..? అన్న అంశాలు మాత్రం ఇంకా వెలుగు చూడలేదు.
ఇదిలా ఉండగానే ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల ప్రచారంలో ఉండగానే గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశారు. ఆయనకు తగలకుండా పవన్ కళ్యాణ్ సమీపంలో పడింది. దీంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. దాడి చేసిన వ్యక్తిని గుర్తించి జన సేన కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మరవక ముందే విశాఖ పట్నం గాజువాక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగానే ఆకతాయిలు రాళ్ళు విసిరారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రాళ్ళు విసిరిన వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. రాళ్ళ దాడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేగం పుంజుకుంటున్నాయి.
రాజకీయ నేతలు సంయమనం పాటించిక పోతే , పోలీసులు అప్రమత్తంగా లేక పోతే తప్పనిసరిగా రాళ్ళ దాడి కొనసాగింపు వికృత పోకడలకు దారీ తీసే అవకాశాలు లేక పోలేదు. మాటలు తూలడం .. వ్యక్తిగతంగా కాకుండా కుటుంబాలను టార్గెట్ చేయడం గత కొంత కాలంగా ఆంధ్ర రాజకీయాల్లో కొనసాగుతోంది. అధికారమే పరమావధి అయినప్పడు ఏం చేయడానికైనా వెనుకాడే పరిస్థితి ఉండదు. వ్యక్తగత దూషణల స్థాయి నుంచి భౌతిక దాడుల స్థాయికి ఆంధ్ర రాజకీయాలు దిగజారి పోవడం విచారకర పరిణామం. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్సార్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు లక్షలాది మందిని పోగేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. దీని వల్ల ఆకతాయిల చేష్టలకు అడ్డుకట్ట వేయడం పోలీసులకు అంత సులభమైన విషయమేమి కాదు. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న వేళ పోలీసులకు ఇలాంటి దాడులు కత్తి మీద సాము లాంటివే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE