తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం 73వ వడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు నేడు ఏపీ వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు భారీ కేక్స్ కట్ చేసి తమ నాయకుడి పుట్టినరోజు వేడుకలు జరుపనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ట్విట్టర్లో ఇప్పటికే ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రస్తుతం ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు తన జన్మదిన వేడుకలను ఆయన జిల్లాలోని మార్కాపురంలో పార్టీ శ్రేణుల మధ్య జరుపుకోనున్నారు.
కాగా చంద్రబాబు నాయుడు, అమ్మణమ్మ-ఖర్జూర నాయుడు దంపతులకు ఏప్రిల్ 20, 1950లో చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో జన్మించారు. 1972లో బీ.ఏ పూర్తి చేసిన ఆయన.. శ్రీ వెంకటేశ్వర యూనిర్సిటీ నుంచి ఎకనమిక్స్లో పీజీ పూర్తి చేశారు. అనంతరం రాజకీయాలపై మక్కువతో 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 28 ఏళ్లకే అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాతి కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్లు సీఎంగా పనిచేశారు. విభజన తర్వాత 2014లో ఏపీ ప్రజలు సీఎంగా ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో ఐదేళ్ల పాలన పూర్తి చేసుకున్న ఆయన.. అనంతరం గత 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలవబోతుందన్న ధీమాతో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE