ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లోక్సభకు త్వరలో ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారనే అంశంపై గత కొన్నిరోజులుగా చర్చ నడుస్తుంది. తాజాగా తిరుపతి ఉపఎన్నిక బరిలో ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేయనున్నారో స్పష్టత నిచ్చారు. జనసేన పార్టీ మద్దతుతో తిరుపతిలో బీజేపీ అభ్యర్థి పోటీలో ఉంటారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మురళీధరన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈరోజు జరిగిన సమావేశంలో ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏపీలో తిరుపతి నుంచే బీజేపీ విజయయాత్ర మొదలవుతుందని మురళీధరన్ పేర్కొన్నారు. బరిలో నిలిచే అభ్యర్థి పేరును కూడా బీజేపీ త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.
@BJP4India‘s victory march will begin from TPTY@BJP4Andhra & @JanaSenaParty will expose the shady designs of @YSRCParty & @JaiTDP that undermine the beliefs of devotees.
These satraps self-serving & partisan approach deprived people of TPTY. Time to put an end to such trends
— V Muraleedharan (@VMBJP) March 12, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ