తిరుపతిలో అన్ని వసతులతో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి ఓ భక్తుడు భారీ విరాళం ఇచ్చారు. ముంబయికి చెందిన ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్(యూఐసీ) సంస్థ సీఈవో, ఎండీ సంజయ్ సింగ్ రూ.300 కోట్ల వ్యయంతో ఆసుపత్రి నిర్మాణానికి ముందుకొచ్చారు. 300 పడకల ఆసుపత్రిని నిర్మించి టీటీడీకి అప్పగించేందుకు ఆయన అంగీకరించారు. ఇందుకు సంబంధించి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సమక్షంలో టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, సంజయ్ సింగ్లు పరస్పర అవగాహన ఒప్పందంపై (ఎంవోయూ) సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, తిరుపతిలో రూ.300 కోట్లతో 300 పడకల ఆస్పత్రి నిర్మాణానికి ముంబయికి చెందిన భక్తుడు సంజయ్సింగ్ ముందుకొచ్చారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా రాష్ట్రంలో మరో రెండు చోట్ల టీటీడీ ఆధ్వర్యంలో ఆస్పత్రులు నిర్మిస్తామని ప్రకటించారు. ఆసుపత్రుల నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఏర్పాటు చేశామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ